పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం,
భారతి నగర్ డివిజన్ల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల ప్రారంభం అయ్యాయి. బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ గాకటరు బస్తీ దవాఖానాలు ప్రారంభం కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రకటన చేసింది
తెలంగాణ సర్కార్. ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకప వైద్య సేనలు అందిస్తామని.. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పింది తెలంగాణ సర్కార్. బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారని.. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దుని పేర్కొంది తెలంగాణ సర్కార్.. ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ బస్తీ దవాఖానాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం సూచించిందన్నారు తెలంగాణ సర్కార్.
టీ డయాగ్నసిస్ ద్వారా మీరు రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు అందుతుంది. ఈ ఆసుపత్రిసేవలు వినియోగించుకోండని తెలిపింది తెలంగాణ సర్కార్.
హైదరాబాద్ పరిథిలో 256 బస్తీదవాఖానాల ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేలమంది ఉచిత వైద్యం అందుతోందన్నారు తెలంగాణ సర్కార్. పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నామని తెలిపింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక మందులు లేవు అన్న సమస్యే ఉండదని తెలిపింది తెలంగాణ సర్కార్. పాము కాటు,
కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుుత్రుల్లో అందుబాటులో ఉంటాయి... ఇప్పటి వరకు
కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని టిమ్స్ లో ఇక అన్ని రకాల వైద్య సేవలు , కార్పోరేట్ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపింది
తెలంగాణ సర్కార్.