దారుణం: ఢిల్లీలో భవనము కూలి 4 మృతి...
ఇప్పటికే కొందరు చిన్నారులు, ఐదుగురు శిధిలాల కింద దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళలను ప్రాణాలతో రక్షించి హాస్పిటల్ కు తరలించారు. వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. కూలిన భవనంలో దాదాపు 300 నుంచి 400 వరకు ప్లాట్లు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, కొందరు అంబులెన్స్ సిబ్బంది మరియు జేసిబిలతో అందరూ కలిసి ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించే ప్రయత్నం లో నిమగ్నులై ఉన్నారు. అందరినీ ప్రమాదం నుండి కాపాడటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో ఎంత మంది ప్లాట్ లలో ఉన్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారట. ఈ ఘటనలో గాయాలు పాలయిన అందరూ వీలైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్ధిద్దాం .