ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు...
ఇదెక్కడి న్యాయం , ఇలా మాట్లాడటం మాకు బాధాకరమే కాదు తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమర వీరుల త్యాగానికి కూడా అర్దం లేకుండా పోతుంది. రాష్ట్ర విభజనపై రాజ్య సభలో దేశ ప్రధాని మోదీ గారు చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ఈ విషయంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మోదీ వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణను మళ్ళీ ఏపిలో కలిపేందుకు ఆలోచిస్తున్నట్లు ఉంది. ఆయన మాట తీరు చూస్తుంటే తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కుతున్నట్లు స్పష్టమవుతోంది అంటూ ఘాటుగా స్పందించారు.
ఈ విషయంలో మోదీ గారి వ్యాఖ్యలు ఇక్కడి బిజెపి నేతలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయేమో కానీ మా మనసులకు మాత్రం తీవ్రంగా గాయాన్ని కలిగించేలా ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే దేశ ప్రధాని తెలంగాణ పై విషం వెదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ఇలా మోదీ వ్యాఖ్యలు ఇంకెంత గందరగోళాన్ని సృష్టిస్తాయో తెలియడం లేదు.