పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలకు కారణం అదేనా... ?
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం పెంచడం లేదు. ఒకవేళ పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఒక భయం. అందుకే గత కొన్ని రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఏ మాత్రం మార్పు లేకుండా కొనసాగుతున్నా మరికొన్ని రోజుల్లో భారీగా పెరుగుతాయని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, ప్రస్తుతం 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడానికి పెట్రోల్ డీజల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచారు.
ఒక్కసారి ఈ ఎన్నికలు కనుక ముగిశాయంటే మళ్ళీ యధావిధిగా ఎన్డీయే దెబ్బ ఏమిటో చూపిస్తుంది అని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు డెలాయిట్ ఎం ఇ యు. ఎల్ ఎల్ పి సంస్థ పార్టనర్ దేబాశిష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఎంతవరకు పెరుగుతుంది అనే విషయం కూడా ఈయన చెప్పడం విశేషం. ఎన్నికలు పూర్తి అయ్యాక దాదాపు ఒక లీటర్ ధరలో 8 రూపాయలు పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది.