సైలెంట్‌గా ‘సైకిల్’ నడిపించేస్తున్నారు!

M N Amaleswara rao
రాష్ట్రంలో పరిస్తితులు కాస్త దారుణంగా తయారవుతున్న విషయం తెలిసిందే...ఇప్పటికే కోవిడ్ వల్ల ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా చాలా వరకు నష్టపోయారు...పైగా ప్రభుత్వం పెంచుతున్న ధరలతో ప్రజలు ఆర్ధికంగా ఇంకా నష్టపోతున్నారు..దీనికి తోడు జగన్ ప్రభుత్వం అనేక సమస్యలని తీసుకొచ్చి పెడుతుంది. ఈ సమయంలోనే జిల్లాల విభజన తెరపైకి తీసుకొచ్చి...ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయింది. అటు ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రచ్చ లేపింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ వల్ల జీతాలు పెరగపోగా, జీతాలు తగ్గాయని చెప్పి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

జిల్లాల విభజన అనేది మంచి విషయమే...కానీ సమయం సందర్భం లేకుండా విభజన చేశారు..అలాగే విభజనతో ఒక ప్రాంతానికి న్యాయం...మరొక ప్రాంతానికి అన్యాయం అన్నట్లు పరిస్తితి ఉంది. పైగా జిల్లాల పేర్లు ఒకటి వివాదం. అలాగే జిల్లాల కేంద్రాల విషయంలో రచ్చ నడుస్తోంది. ప్రజలు ఈ విభజనపై ఆందోళన చేస్తున్నారు. ఇలా అన్నిరకాలుగా రాష్ట్రంలో రచ్చ నడుస్తోంది. అయితే జిల్లాల విభజన విషయంలో గాని, ఉద్యోగుల ఆందోళన విషయంలో ప్రతిపక్ష టీడీపీ ఎక్కువ జోక్యం చేసుకోలేదు. మద్ధతు అయితే ఇచ్చింది గాని ప్రత్యేకంగా ఆ సమస్యలని భుజాన వేసుకోలేదు. జిల్లాల విషయంలో అన్నీ పార్టీలతో కలిసి టీడీపీ నేతలు కూడా తమ ప్రాంతాలకు సంబంధించి న్యాయం కోసం పోరాడుతున్నారు.

అయితే ఇలా రాష్ట్రంలో ఎక్కడకక్కడే రచ్చ జరుగుతుంది...కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు. టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వారు ముందుకెళుతున్నారు...సైలెంట్‌గా గ్రామాల్లో పర్యటిస్తూ...ప్రజల మద్ధతు పెంచుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఏమో ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉన్నారు..దీంతో టీడీపీ నేతలు సైలెంట్‌గా తమ పనులని చక్కబెట్టుకుంటున్నారు. నియోజకవర్గాల్లో బలం పెంచుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పలు కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇలా టీడీపీ నేతలు  సైలెంట్‌గా సైకిల్‌ని నిలబెట్టే కార్యక్రమాలు చేసేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: