ఏపీ పాలిటిక్స్ : ఆ జిల్లాపై పవన్ కన్ను..?
అయితే, ఈసారి కాపులు ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి నుంచి పవన్ బరిలో దిగుతారని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరిద్ధరి మధ్య ఢీ అంటే ఢీ అనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో అనేక సార్లు కన్నబాబు జనసేనాని ఎద్దేవా చేశారు. దీంతో పాటు కాకినాడలో రూరల్లో కాపుల శాతం బాగానే ఉంది. ఒకవేళ పొత్తులు కుదిరితే ఆ సీటును టీడీపీ పవన్కు ఇచ్చేందుకు సిద్ధం అని చెబుతున్నారట. అన్ని కుదిరితే కాకినాడ సిటీ లేదా కాకినాడ రూరల్ నుంచి పవన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే తూర్పు గోదావరిలోని రాజకీయ ప్రత్యర్థులపై ప్రభావం భారీగానే పడుతుందని అంచనా వేస్తున్నారు.
గతంలో రెండు చోట్లా పోటీ చేసినా ఓడిపోవడానికి కారణం కాపులు అధికంగా ఉన్న తూర్పు గోదావరి నుంచి పోటీ చేయకపోవడమేనన్న వాదన వినిపించింది. ఈ క్రమంలో వ్యూహం మార్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ ఖచ్చితంగా గెలుస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో జనసేనాని తూర్పు గోదావరి జిల్లాపై స్పేషల్ ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది.