వీరుకదా.. బాబూ విశ్వాస పాత్రులు...!
ఉదాహరణకు.. పంచుమర్తి అనురాధ, బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్, వంటివారు..పార్టీ కోసం.. ఎంతకైనా తెగించే పరిస్థితి ఉంది. వీరిలో కొందరు ప్రజాక్షేత్రంలో పనిచేసిన వారు.. గెలిచిన వారు కూడా ఉన్నారు. పంచుమర్తి అనురాధ.. విజయవాడ మేయర్గా కూడా చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది.. ఉన్నారు.
అయితే.. ఇప్పుడు.. వీరికి ఎక్కడా గుర్తింపు లేకుండా పోయిందనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. కేవలం ప్రెస్మీట్ల వరకే వీరు పరిమితమవుతున్నారని అంటున్నారు. ఎందుకంటే.. పైపైన ఆర్భాటం చేసి..అప్పటికప్పుడు వచ్చిన వారికి టికెట్లు.. మర్యాదలు దక్కుతున్నాయి. వారు తమ పనిచూసుకుని.. అవసరం తీరగానే పక్కకు తప్పుకొని.. వ్యాపారాలు వ్యవహారాల్లో మునిగిపోతు న్నారు.
కానీ, పార్టీ కోసం నిరంతరం వాయిస్ వినిపించే మహిళానాయకులు.. కొందరు పురుష నాయకుల పరిస్థితి కూరలో కరివేపాకు మాదిరిగా ఉందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు కూడా దూర మైనా.. లేక వాయిస్ తగ్గించినా.. పార్టీకి మరింత చేటు తప్పదనే సూచనలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా.. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో వారి పనితీరును బట్టి.. ఇప్పటికైనా.. వారిని పార్టీలోను.. పదవుల్లోనూ.. ప్రోత్సహించడం ద్వారా.. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.