రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర విషయం చర్చకు వస్తోంది. ఏదీ తేల్చుకోలేక పోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లాలని.. చంద్రబాబుకు పడిపోయిన ఇమేజ్ను తిరిగి నిలబెట్టాలనిపార్టీ వ్యూహకర్తలు నిర్ణయించారు. ఎందుకంటే.. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ పరువు పోయింది. ఇటీవల స్థానిక సమరంలో కనీసం పోటీని కూడా ఇవ్వలేక పోయింది. నిజానికి ఇక్కడ ప్రజల్లో సానుభూతి ఉంటే