మాజీమంత్రిమోత్కు పల్లి నర్సింలు బీజేపీ పై నిప్పులు చెరిగారు. నిన్న బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని... దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని ఫైర్ అయ్యారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? అని నిలదీశారు. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? అని... బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోందని ఆగ్రహించారు. బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలని ఆగ్రహించారు. నా అనుభవంలో చాలామంది సిఎంలను చూసానని.. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నానని తెలిపారు.
దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారు- బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారు... కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారన్నారు. బండి సంజయ్ కి సిగ్గులేదా? నాతో వస్తవా హుజురాబాద్ పోదామని సవాల్ విసిరారు. బండి సంజయ్ పిచ్చి వెధవ- కేసీఆర్ దళితబంధు ఇస్తానని అంటుంటే వినిపించడం లేదా అని ఆగ్రహించారు. ఒక్క రూపాయి ఇవ్వాలంటే లక్ష షరతులు పెడతారని... ఎస్సి కార్పొరేషన్- స్పెషల్ ఫండ్ వల్ల ఉపయోగం లేదు- కానీ దళితబంధు వల్ల ఉపయోగం ఉందన్నారు.
దళితబంధు కు అడ్డుపడితే ఊర్లలోకి రానివ్వకుండా తొక్కిపెడతారని... బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి వెళ్లి డప్పులు కొట్టాలి దళితబంధు పథకం కావాలని వెల్లడించారు. బండి సంజయ్ దున్నాలనిపిస్తే ఒక ట్రాక్టర్ ఇస్తాం దున్నుపో అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడని హెచ్చరించారు మోత్కుపల్లి. మోడీ 15 లక్షలు ఇస్తాడాని పేదలంతా ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారన్నారు. బీజేపీ ఇస్తానన్న 15లక్షలు ఇవ్వకపోను- కేసీఆర్ 10లక్షలు ఇస్తానంటే అడ్డం వస్తావా? దేశంలో ఎవ్వరికీ అక్కరరాని పార్టీ బీజేపీ అని ఫైర్ అయ్యారు.