హరీష్ రావు మాటకు ఎంత సహాయమో ?

Veldandi Saikiran
సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో ఇవాళ  మంత్రి హరీష్ రావు  పాల్గొన్నారు.  కమిటీల నిర్వహణ , బహిరంగ సభ పై దిశా నిర్దేశం చేసారు  మంత్రి హరీష్ రావు.  ఈ కార్యక్రమం లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ....  యాదాద్రి ఆలయ బంగారు గోపుర నిర్మాణాని కి సిద్దిపేట పట్టణం  నుండి కిలో బంగారం.. స్వచ్ఛంద బంగారం ఇస్తామని  ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు ప్రకటించినట్లు హరీష్ రావు పేర్కొన్నారు.  తన  పిలుపు తో స్వచ్ఛం ధంగ యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని కౌన్సిలర్స్, కార్యకర్తలు ప్రకటించారు వెల్లడించారు మంత్రి హరీష్ రావు... 


 ఐదు గురి సభ్యులతో యదాద్రి కి బంగారం సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. సామజిక , ధార్మిక , ఆధ్యాత్మికత సేవా భావం కు మారు పేరు మన సిద్దిపేట ఐ కొనియాడారు మంత్రి హరీష్ రావు..   గులాబీ జెండా ద్విదశాబ్ది ఉత్సవం.. దీక్షా దివస్ రోజున వరంగల్ లో భారీ బహిరంగ సభ జరుగుతున్నట్లు మంత్రి హరీష్ రావు.  ప్రజల ఆకాంక్ష కు నెరవేర్చిన గడ్డగా... అభివృద్ధి కి దీక్సుచి సిద్ధిపేట అని పేర్కొన్నారు హరీష్ రావు. జల దృశ్యం నుండి.. సుజల దృశ్యం  వరకు..  కరువు కన్నీళ్ల  నుండి కాళేశ్వరం నీళ్ల  వరకు...  ఈ ఇరవై ఏళ్ళ పోరాటం..ఆరాటం..ఆకాంక్ష సిద్దిపేట ది ఒక చారిత్రాత్మక ఘట్టం వెల్లడించారు హరీష్ రావు...


నాయకుడు మాట చెపితే కార్యకర్తలుగా పనిచేస్తాం..  టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే నాయకుని కుటుంబ సభ్యులు అని తెలిపారు హరీష్ రావు. కరోనా కష్ట కాలం లో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం..  కార్యకర్తలలను కంటికిరెప్పల కాపాడుకుంటామనీ తెలిపారు హరీష్ రావు.  29 న సభకు పెద్దఎత్తున తరలి వెలుదాం.. కమిటీల నిర్మాణం పటిష్టంగా చేద్దామనీ పేర్కొన్నారు హరీష్ రావు.  కమిటీల్లో  యువత , మహిళల కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు హరీష్ రావు. అనంతరం   కార్యకర్తలతో కల్సి... ఆత్మీయంగా అన్నం  వడ్డించిన హరిశ్ రావు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: