కాంగ్రెస్
పార్టీ సీనియర్ నేత,
సంగారెడ్డి శాసన సభ్యులు
జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుతామంటే తన మద్దతు ఉంటుందని...తెలంగాణ
కేసీఆర్ కు సహకరిస్తానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.
పేర్ని నాని వ్యాఖ్యలు సమర్ధనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా సమైక్యాంధ్ర కావాలని ఇప్పుడు కోరుకుంటున్నారని... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన కోడళ్లు, కొడుకులు దిగుతున్నారని...పేర్కొన్నారు జగ్గారెడ్డి.
ఆంధ్ర,
రాయలసీమ జీన్స్ ఇంకా ఉన్నాయని...
హైదరాబాద్ లో కోటి మంది ఆంధ్ర,
రాయలసీమ వాళ్ళు ఉన్నారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. విడిపోతే రాష్ట్రం బాగుంటుందని అందరూ కళలు కన్నారని.... కానీ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదని పేర్కొన్నారు జగ్గారెడ్డి. నా బలం, బలహీనత ఏంటో నాకు తెలుసు. ఆంద్ర, రాయలసీమలో పరిస్థితి ఏంటో నాకు తెలుసు....
కేసీఆర్ ఒక
గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి.
హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు...
కేసీఆర్ ట్రాప్ లో నేను పడలేదన్నారు జగ్గారెడ్డి.
కాంగ్రెస్
పార్టీ బలంగా ఉంది.
కాంగ్రెస్ ను తొక్కే దమ్ము
కేసీఆర్ కు లేదని చురకలు అంటించారు జగ్గారెడ్డి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే టాలెంట్
కేసీఆర్ కు ఉంది.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఆలోచన
కేసీఆర్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.
తెలంగాణ, సమైక్యాంధ్ర పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టారు.. భూమ్మీద ఇది జరగాలి, జరగొద్దు అని ఏమి లేదు. అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్,
వైసీపీ ఒక్కటే.. జగన్,
కేసీఆర్ వేరు వేరు కాదు. దీని వెనుక
బీజేపీ ఉండే అవకాశం ఉందన్నారుజగ్గారెడ్డి.
కేసీఆర్ నాడీ నాకు బాగా తెలుసు ఇక మీద ఎలాంటి ఉద్యమాలు రావు. చర్చల ద్వారానే ఏకం అవుతారని చెప్పా రు.