చిత్తూరులో ఈ సీట్లు మళ్ళీ గోవిందా?
అయితే నెక్స్ట్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి కూడా చిత్తూరులో వైసీపీ పై చేయి సాధించడం ఖాయమని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 13 గెలుచుకుంది...ఇక టిడిపికి ఒక కుప్పం మాత్రం వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి 13 సీట్లు వచ్చేస్తాయా? అంటే అది చెప్పలేం. ఎందుకంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఏమి బాగోలేదు. పైగా కొన్నిచోట్ల టిడిపి నేతలు గట్టి పోటీ ఇస్తున్నారు.
అలాంటప్పుడు వైసీపీకి సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశాలు లేవు. అయితే చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ చాలా ఎత్తులు వేస్తుంది. పంచాయితీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో సత్తా చాటింది. కానీ సాధారణ ఎన్నికల్లో ఆ పరిస్తితి ఉండదనే చెప్పొచ్చు. మళ్ళీ చంద్రబాబు విజయానికి ఎలాంటి ఢోకా ఉండదని తెలుస్తోంది.
అలాగే పీలేరు, తిరుపతి, నగరి, గంగాధర నెల్లూరు, పలమనేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుంగనూరు, తంబళ్ళపల్లె, పూతలపట్టు, చిత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మొత్తం మీద చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఈ సారి కూడా వైసీపీనే పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.