ఏపీలో ఇప్పుడు ఎన్నిక‌లొస్తే... టీడీపీ స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ ?

VUYYURU SUBHASH
ఏపీలో సాధారణ ఎన్నికలు జరిగే ఈ రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి  వచ్చే ఎన్నికలకు అప్పుడే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన ఈ రెండు సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. సర్పంచ్ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ మునిసిపల్ ఎన్నికలలో టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. టిడిపి ఒక్క కార్పోరేష‌న్లునూ గెలవలేదు. ఇక‌ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తో మాత్రమే సరిపెట్టుకుంది. ఆ విజ‌యం కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖాతాలోనే పడింది.

ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ? ఉంటుంది అన్న దానిపై టిడిపి వాళ్ళు లోకేష్ టీం అంతర్గతంగా ఒక సర్వే చేయించుకున్న తెలుస్తోంది. ఈ స‌ర్వేలో టీడీపీ కాస్త పుంజుకున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. టీడీపీ ఎవ‌రితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తే ఏపీలో ఉన్న మొత్తం 25 లోక్ స‌భ స్థానాల‌కు గాను వైసీపీ 19 చోట్ల‌.. టీడీపీ ఆరు చోట్ల గెలుస్తుంద‌ని తేలింద‌ట‌. ఈ స‌ర్వే కేవ‌లం లోక్ స‌భ స్థానాల‌ను బేస్ చేసుకుని మాత్ర‌మే జ‌రిగింది.

ఇక టీడీపీ  + జ‌న‌సేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఈ రెండు పార్టీల కూట‌మి మొత్తం 25 ఎంపీ సీట్ల కు గాను 14 చోట్ల విజ‌యం సాధిస్తుంద‌ని తేలింద‌ట‌. ఈ రెండు పార్టీల పొత్తు వైసీపీకి షాక్ ఇస్తుంద‌ని స‌ర్వే చెపుతోంది. ఇక ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసినా కూడా వైసీపీకి ఏకంగా 11 ఎంపీ సీట్లు వ‌స్తున్నాయి. సీమ‌, నెల్లూరు , ప్ర‌కాశం జిల్లాల‌లో వైసీపీ చాలా బ‌లంగా ఉంద‌ని.. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వైసీపీని ఈ రెండు పార్టీ లు క‌లిసినా కూడా ఎదిరించే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వేలో తేలిన‌ట్టు ఆ పార్టీ వాళ్లే చెపుతున్నారు. మ‌రి టీడీపీ స‌ర్వే పై వైసీపీ నేత‌ల నుంచి ఎలాం టి రిటాక్ట్ ఉంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: