టీడీపీలో ఒకేఒక్క హీరో ఆ ఎమ్మెల్యే... సత్తాచాటాడుగా...!
అలాగే మార్టూరు మండలం జొన్న తాళి ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని మానం కళ్యాణి 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి ఎంపీటీసీ గా బొల్లినేని సాంబయ్య గెలిచారు. అన్నంబోట్లవారి పాలెం ఎంపీటీసీ చెన్నుపాటి రమాదేవి గెలుపు బావుటా ఎగర వేశారు. ఇక ప్రతిష్టాత్మకంగా జరిగిన కారంచేడులో కారంచేడు ఎంపీటీసీ 2 నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన యార్లగడ్డ అక్కయ్య చౌదరి 163 ఓట్లతో ఘన విజయం సాధించారు.
దేవరపల్లిలో టీడీపీ విజయం సాధించింది. ఇక్కడ ఎంపీటీసీ గా కాపు రామచంద్ర విజయభేరీ మ్రోగించారు. మార్టూరు మండలంలోని వలపర్ల తూర్పు ఎంపీటీసీగా జంజనం పద్మ టీడీపీ గెలుపు బావుటా ఎగరవేవారు. ఇక్కడ ఆమెకు ఏకంగా 140 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఏదేమైనా ఈ ఎన్నికలను టీడీపీ పూర్తిగా బహిష్కరించేసింది. ఎమ్మెల్యే ఏలూరి ఉన్నారన్న అండదండలతో స్థానిక టీడీపీ కేడర్ కొన్ని చోట్ల పోరాటం చేస్తే వచ్చిన ఫలితాలు ఇవి.