ప్రశ్నలతో జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన యనమల !
బీసీ జనగణనపై జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు.? సెంటు పట్టా పేరు తో బీసీల నుండి వేలాది ఎకరాలు లాక్కోవడం వాస్తవం కాదా. ? అని ప్రశ్నించారు. మడ అడవుల్ని నాశనం చేసి మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీశారని... స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించి 16,800 మందిని రాజకీయాలకు దూరం చేశారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం జగన్ రెడ్డి ఎందుకు నోరెత్తడం లేదు.? రిజర్వేషన్లపై పలు రాష్ట్రాలు పోరాడుతుంటే.. జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది.? అని నిలదీశారు.
బీసీ కార్పొరేషన్ నుండి నిధుల మళ్లించి కార్పొ రేషన్ నిర్వీర్యం దుర్మార్గం కాదా.? నిధులు, విధులు ఉన్న నామినేటెడ్ పదవులు సొంత వారికా.? అని మండిపడ్డారు. నిదులు విధులు కనీసం కుర్చీ ల్లేని పదవులు బీసీలకా.? ఉచిత ఇసుకను రద్దుతో 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని దెబ్బతీశారన్నారు. రెండేళ్లలో 254 మంది బీసీలపై దాడులకు పాల్పడ్డారు. ఆస్తులు ధ్వంసం చేశారని... 11 మంది టీడీపీ బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని ఫైర్ అయ్యారు యనమల రామ కృష్ణుడు.