సొమ్ముల్లేవ్: ఇలా అయితే... జగనోరు పెవిలియన్ కే ?
అలా ఆలోచించకపోవడం వల్లనే రెండు సంవత్సరాల తర్వాత దాని పర్యవసానాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. వివిధ బ్యాంకుల నుండి వేల కోట్లు అప్పులు తీసుకుని, ఆ డబ్బు అంతటినీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రము ఆర్ధికంగా చాలా కష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. దీనికి బలవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి రావలసిన జీతాలు సమయానికి రావడం లేదు. దీని వలన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా దీని మీదనే ఆధారపడి ఉన్నాయి.
రాష్ట్రము నుంచి ఏదయినా ఆదాయం వస్తేనే బదిలీలు జరుగుతాయట, అవి కూడా వాయిదా పద్దతులలో చేయనున్నారని సమాచారం. ఇక అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి నత్త నడకన సాగిందో.. ఇప్పుడు అంతే. ఈ విషయంలో మాత్రం జగన్ సమన్యాయం పాటించారు. చంద్రబాబు సీనియర్ కాబట్టి ఆయననే ఫాలో అయ్యారు. ముందు ముందు రోజుల్లో అయినా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బాగుంటుందని లేదంటే పెవిలియన్ లో కూర్చోవలసిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జగన్ మిగిలిన రెండేళ్లలో ఏమైనా అద్భుతాలు చేయగలడా అన్నది చూడాలి.