మళ్లీ తెర మీదికొచ్చిన దిశ ఎన్ కౌంటర్ కేసు?

praveen
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఎంతలా సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక అమాయకమైన వెటర్నిటీ డాక్టర్ను  నలుగురు మానవ మృగాలు దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అయితే ఈ ఘటనలో నిందితులను శిక్షించాలని దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత సీపీ సజ్జనార్ మరోసారి తనదైన శైలిలోనే ఇక ఈ అత్యాచారం హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై అటు దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే నిందితులను కేసు రిస్ట్రక్చరింగ్ చేస్తున్న సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే ఏక ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అంటూ సీపీ సజ్జనార్ వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పలు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పడ్డాయి. ఇకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు మళ్లీ తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొంతకాలం నుంచి ఇక ఈ ఎన్ కౌంటర్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు సిర్పూర్ కర్ నేతృత్వంలో ఈ కేసుపై విచారణ జరిపేందుకు జుడిషియల్ కమిషన్ ఏర్పాటు ఏర్పాటు చేశారు.



 అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ కాస్త జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇక జ్యుడీషియల్ కమిషన్ మళ్లీ వారి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే దిశ అత్యాచారం హత్య కేసులో ఎన్కౌంటర్ కు గురైన నిందితుల కుటుంబాలను ఇక జుడిషియల్ కమిషన్ సభ్యులు కలవనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ గ్రామాలకు బయలుదేరారు. దిశ కేసులో ఎన్కౌంటర్కు గురై నిందితుల కుటుంబాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: