మాజీ
మంత్రి ఈటల రాజేందర్
ఎమ్మెల్యే పదవీ
రాజీనామా అనంతరం.. హుజురాబాద్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి విధితమే. అయితే... ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ లో గెలవాలని సీఎం కేసీఆర్ అనే వ్యూహరచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే దళిత బంధు పతకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం.... ఒక్కో దళిత కుటుంబానికి... ఏకంగా 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది
తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రెండు వేల కోట్లు విడుదల చేసింది
తెలంగాణ క్యాబినెట్.
అంతేకాదు ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకురానుంది సర్కార్. దీంతో అందరిలోనూ... అనుమానాలు నెలకొన్నాయి. హుజరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బందు పథకాన్ని తీసుకు వస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. దళిత బందు పథకాన్ని స్వాగతిస్తూనే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ. అయితే తాజాగా అధికార
టీఆర్ఎస్ పార్టీలో దళిత బంధు పథకం పై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి .
దళిత బంధు పథకం గొప్పదని... ఆ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్ప వారని కొనియాడారు. అయితే ఈ దళిత బంధు పథకాన్ని ఒక హుజూరాబాద్ నియోజకవర్గం లోనే అమలు చేస్తే
టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఓటమి తప్పదని పేర్కొన్నారు. అంతేకాదు భవిష్యత్తులో... టిఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని వెల్లడించారు. కాబట్టి దళిత బందు పథకాన్ని
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తెలిపారు కడియం శ్రీహరి. అయితే తాజాగా కడియం
శ్రీహరి దళిత బంధు పథకం పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అధికార టిఆర్ఎస్
పార్టీ సొంత నేతలే... దళిత బంధు పథకం పై ధిక్కార స్వరాన్ని పెంచడంపై గులాబీ బాస్ లో ఆందోళన మొదలైనట్లు సమాచారం అందుతోంది.