ప్ర‌జారాజ్యంలో గెలిచిన క‌మ్మ ఎమ్మెల్యేలు ఎవ‌రో తెలుసా ?

VUYYURU SUBHASH
తెలుగు సినిమా రంగంలో తిరుగులేని రారాజు గా ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తెలుగు సినిమా రంగాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు లేకుండా ఏలేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారో ఎన్టీఆర్‌లా ఇక్కడ కూడా తిరుగులేని హీరోగా నిలుస్తారని అందరు అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ వాతావరణం వేరు... చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉన్న వాతావరణం వేరు కావడంతో చిరంజీవి రాజకీయాలలో నెగ్గుకు రాలేకపోయారు. ఈ క్రమంలోనే 2009లో నాటి సమైక్యాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకుంది.

పార్టీ అధ్యక్షుడి హోదాలో పాలకొల్లు - తిరుపతి లో పోటీ చేసిన చిరంజీవి తిరుపతిలో గెలిచి... సొంత నియోజకవర్గం అయిన పాలకొల్లులో ఓడిపోయారు. ఆ తర్వాత ఏడాదిన్నరపాటు ప్రజారాజ్యం పార్టీని నడిపించిన చిరంజీవికి అప్పుడున్న వాతావరణంలో ఎక్కువ కాలం పార్టీని నడపలేని అన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ప్రజారాజ్యాన్ని 2011లో కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి కట్టబెట్టింది. 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో కొన్నాళ్లపాటు ఆ పార్టీలోనే ఉన్న చిరంజీవి తర్వాత రాజకీయాలకు దూరమై తిరిగి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది కాపు నేతలే ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత కూడా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఎవరో కాదు విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి. మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి నాగేశ్వరరావు తనయుడు అయిన రవి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి 190 ఓట్ల స్వల్ప తేడాతో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పై విజయం సాధించారు. అలా క‌మ్మ వర్గంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా ఆయన రికార్డు సృష్టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: