స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం రక్తం పంచుకుని పుట్టిన సొంతవారికి కూడా చెప్పుకోలేని విషయాలను మనం స్నేహితులతో పంచుకుంటాం. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాం, లైఫ్లో మంచి ఫ్రెండ్ దొరికితే చాలు.. జీవితాంతం సంతోషంగా బతికేయొచ్చు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడుగా ఉండే అలాంటి స్నేహాన్ని గుర్తు చేసుకొనే ఈ రోజు బాగున్నారా అనేది ఒకప్పుడు పలకరింపు పదం ఇది కానీ ఇప్పుడు కరోనా కష్టకాలంలో మొదట వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా అడగాల్సిన మాట బాగున్నారా.. కరోనాతో ఎవరు ఎలా ఉన్నారో, ఏమిటో తెలియని పరిస్థితి.. అందుకే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను, నా శత్రువులు, నా మిత్రులు కూడా ఉండాలి.
మన
స్నేహ బంధం అనేది మనం ఎప్పుడూ ఏ పరిస్థితిలో ఉన్న ఆదుకున్నప్పుడే నమ్మకం కుదురుతుంది. అలాంటి ఓ ఇద్దరు స్నేహితులే ఇప్పుడు బద్ధ శత్రువులు అయ్యారు. ఉద్యమ కార్యాచరణ నుంచి,
తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే అంతవరకు వారి ఆలోచనా విధానం ఒకరికొకరు కలిసి ఉండే విధానం ఎంతో బాగుండేది. ఒక తల్లికి పుట్టిన పిల్లల్ల ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఒకరికొకరు చెప్పుకొని ముందుకు నడిచేవారు. అలాంటి ఇద్దరు స్నేహితుల మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే ఎంత పరిస్థితికి వచ్చారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ తమ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఇద్దరే
ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు. వీరిద్దరూ
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించిన వారే.. ఆనాటి ఉద్యమం నుంచి వారి
మంత్రి పదవులు వచ్చేవరకూ ఒకరినొకరు అన్యోన్యంగా కలిసి ఉండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ భర్తరఫ్ అయ్యారు. ఆయన
తెరాస నుంచి బయటకు వచ్చినా మరుసటి రోజే తన మిత్రుడైన హరీష్ రావు గురించి మాట్లాడారు.
మిత్రమా హరీష్ రావు నన్ను ఏ విధంగా అయితే టిఆర్ఎస్
పార్టీ నుంచి బయటకు పంపారో రాబోవు రోజుల్లో నీ పరిస్థితి కూడా అంతే అని అన్నారు. కానీ దీనిపై హరీష్ రావు ఏ విధంగా కూడా స్పందించలేదు. కానీ
కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అదేమిటంటే ఈటల రాజేందర్ ను దీటు చేయాలంటే అది హరీష్ రావు వల్ల మాత్రమే అవుతుందని హరీష్ రావుకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా వారి మధ్య ఉన్నటువంటి స్నేహం కాస్త వైరంలా మారింది.