పవన్ కీలక నిర్ణయం... బ్యాక్ టు పాలిటిక్స్ ?

VAMSI
రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత దాదాపు మూడేళ్ళ వరకు సినిమాలకు విరామం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతరం 'వకీల్ సాబ్' చిత్రంతో కమ్ బ్యాక్ గా తన రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల కిక్ ఇచ్చి పవన్ స్టార్ డమ్ సత్తా ఏమిటో చాటి చెప్పింది. ఈ చిత్రం తరువాత ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే చిత్రం చేస్తున్నారు పవన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అంతే కాకుండా దీనితో పాటుగా 'అయ్యప్పనుమ్ కోషియం' మూవీ టీజీలుగు రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అయితే ఇలా వరుస సినిమాలతో ఏ మాత్రం బ్రేక్ లేకుండా వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్న పవర్ స్టార్ రాజకీయాల పై పూర్తిగా ఫోకస్ పెట్టలేక పోతున్నాను అని ఫీల్ అవుతున్నారట.

అందుకే కొద్ది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లన్నిటికీ బ్రేక్ ఇచ్చి మళ్లీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. పార్టీ పై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రత్యర్థులు విమర్శలు విసిరేందుకు రెడీ అవుతారు. కానీ ఆ చాన్స్ ఎవరికీ ఇవ్వకుండా అటు సినిమాలను ఇటు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్  అనిపించుకోవాలి అనుకుంటున్నారట పవన్.  కాగా పవర్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పటికే రాజకీయ పరంగా ఒక ప్రముఖ పార్టీగా పేరు గాంచింది. ఇపుడు పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని అందుకుని పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

కానీ ఇప్పటికే ప్రజల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భోగట్టా. మరి ఏదైనా ఒక సినిమా పూర్తి చేసిన తరువాత వెళ్లనున్నారా లేదా రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే వెళుతారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: