సమస్యల పరిష్కారమే సైబర్ యోదా లక్ష్యం : మహేష్ భగవత్

praveen
గతంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సైబర్ యోదా అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి రోజుల్లో ఎంతో మంది యువత చిన్నారులు సోషల్ మీడియా పట్ల ప్రభావం అవుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు దీన్ని ఆసరాగా చేసుకొని ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు.  ఇలాంటి నేపథ్యంలోనే ఇక సైబర్ నేరాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు సైబర్ యోదా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. అయితే ఇటీవలే సైబర్ యోదా కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు సీపీ మహేష్ భగవత్.



 లాక్ డౌన్ ముందు సైబర్ నేరాలను అరికట్టాలానే ఉద్దేశంతో సైబర్ యోదా కార్యక్రమాన్ని ప్రారంభించామూ అంటూ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు. 100 మందితో ఈ సైబర్ యోదా కార్యక్రమం ప్రారంభమైంది అంటూ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో 21 మంది విద్యార్థులు 30 మంది ఐటీ ఉద్యోగులు ఆరుగురు రిటైర్డ్ ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అంటూ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు. మహిళలపై చిన్నారులపై సామాన్యులపై కూడా డిజిటల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఇలాంటి మోసాలపైనే సైబర్ యోదా పని చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.



 ఇక సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోయిన వారు వివిధ పోలీస్ స్టేషన్ లకు చేరుకొని న్యాయం కోసం ఫిర్యాదులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి సమస్యలను సైబర్ యోదా పరిష్కరిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంధానకర్తగా సైబర్ యోధ ప్రస్తుతం అద్భుతంగా కొనసాగుతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఆన్లైన్ మోసాలు పై ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ మహేష్ భగవత్ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించు కొని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. టెక్నాలజీని మంచి కన్నా చెడు కోసం ఉపయోగించేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు అంటూ మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు. త్వరలో సైబర్ ల్యాబ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cp

సంబంధిత వార్తలు: