భార్యకు పిల్లలు కలగలేదని భర్త రెండో పెళ్లి.. కానీ చివరికి?

praveen
పెళ్లంటే..  మూడుముళ్ల బంధం వందేళ్ళ అనుబంధం.. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఇక కడవరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి.  చివరి వరకు ఎలాంటి సమస్య వచ్చిన సంతోషం వచ్చినా నేనున్నాను భర్తకు భార్య.. భార్య కు భర్త అండగా నిలవాలి. అయితే ఇక దాంపత్య జీవితం మొదలైన తర్వాత ఏ భార్య భర్తలు అయినా తమకు పిల్లలు కలగాలని ఆశ పడుతూ ఉంటారు.  కానీ కొంతమంది  విషయంలో మాత్రం విధి చిన్నచూపు చూస్తూ ఉంటుంది.  ఇక పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లలు లేకపోవడంతో భార్య భర్తలు బాధపడుతూ ఉంటారు.



 ఇక్కడ ఓ యువకుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది  పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్ట లేదు. దీంతో ఇక రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు ఆ యువకుడు  మొదటి భార్య ఇష్టంతోనే మరో యువతి మెడలో తాళి కట్టాడు. కానీ విధి అప్పటికి అతన్ని చిన్నచూపు చూసింది. రెండో భార్యకు కూడా పిల్లలు కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన  యువకుడు చివరికి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ యువకుడు నదిలో దూకాడు అన్న విషయం తెలుసుకున్న పోలీసులు బ్యారేజ్ వద్దకు చేరుకొని యువకున్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడు.


 ఇక అతని ఫోన్ ఆధారంగా అతను గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు  సదరు వ్యక్తి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కుమారి కుమారుడు మహంకాళి గా పోలీసులు గుర్తించారు  రెండేళ్ల కిందట మహంకాళి కి పెళ్లి జరుగగా పిల్లలు కాలేదు  దీంతో సదరు వ్యక్తి మొదటి భార్య అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు కూడా  పిల్లలు కాకపోవడంతో మనస్థాపానికి గురై  ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు తెలిపింది. ఇక ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: