1500 కోట్లు.. 30 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ రెడీ?
ఈ క్రమం లోనే సామర్థ్యానికి మించి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలి అంటూ ప్రస్తుతం టీకాలు ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన ప్రోత్సాహకాలను కూడా అందించారు. అయితే కేవలం ఈ రెండు కంపెనీల మీద ఆధార పడకుండా మరిన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాదుకు చెందిన 'బయోలాజికల్- ఈ' సంస్థతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా 30 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ఇచ్చినందుకు పదిహేను వందల కోట్ల రూపాయల చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అయితే పదిహేను వందల కోట్ల రూపాయలను ముందస్తుగా చెల్లించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే 1,2 దశలకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది సంస్థ. ఇలా దేశంలో ఏర్పడిన వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఇది ఒక కీలకమైన దశ గా భావిస్తున్నారు విశ్లేషకులు.