ఆంధ్రాలో బ్లాక్ ఫంగస్.. బాధితుడి లక్షణాళివే..
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఓ వ్యక్తికి ‘బ్లాక్ ఫంగస్’ లక్షణాలు కనిపించాయి. స్థానికులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..15 రోజుల క్రితమే ఆ పేషెంట్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే, ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడి కన్ను వాచిపోయి ఉంది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయగా ఫంగస్ లక్షణాలు ఉన్నట్లుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో నిడదవోలులోని బ్లాక్ ఫంగస్ బారిన పడిన వ్యక్తి ఇంటికి వైద్య బృందం వెళ్లింది. స్థానిక ఆర్డీఓ, వైద్య అధికారులు, నోడల్ అధికారులు.. బాధితుడితో మాట్లాడి, ల్యాబ్ రిపోర్ట్లు పరిశీలించారు. ఫంగస్ లక్షణాలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని ఆర్డీఓ వెల్లడించారు. అలాగే బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది.