ఆ రాష్ట్రలకు కోవ్యాక్జిన్ పంపిణీ...

Purushottham Vinay
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తోంది.రోజు రోజుకి ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. రోజుకి 4 లక్షలకి తగ్గకుండా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాప కింద నీరు లాగా ఈ కరోనా మహమ్మారి నలు మూలలా వ్యాపిస్తుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదనే చెప్పాలి. కాబట్టి ఈ క్రమంలో అందరూ కూడా తప్పకుండా టీకా తీసుకోవాలి.ఇక ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలకు టీకాలు ఇవ్వడం తప్పనిసరి.ఇక ఈ నేపథ్యంలో కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ సంస్థలు నెలకు 7 కోట్ల టీకాలని ఉత్పత్తి చేస్తున్నాయి.మే 1వ తేదీ నుంచి దేశంలోని దాదాపు 18 రాష్ట్రాలకు డైరెక్ట్ గా కో వ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నట్లు దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ  భారత్ బయెటిక్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బిహార్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ష్ట్రాలకు కో వ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేయడం జరిగింది.

18 రాష్ట్రాలకు తాము కోవ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నామని.. తాము కంటిన్యూస్ గా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామంటూ దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటిక్ సంస్థ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసింది.భారత్ బయోటెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని తెలపడం జరిగింది....

ఏప్రిల్ 29 న, భారత్ బయోటెక్ రాష్ట్రాల కోవాక్సిన్ ధరను మునుపటి రూ.600 నుండి రూ.400లకు తగ్గించినట్లు ప్రకటించింది. ఇది కోవాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ.150కే అందిస్తోంది.ఇక సెంట్రల్ గవర్నమెంట్ నియమాల ప్రకారం ఆ సంస్థలు వ్యాక్సిన్ లు పంపిణీ చెయ్యబోతున్నాయి. అంటే ఇప్పుడు పంపించే వ్యాక్సిన్లు 45 సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: