""దీదీ" గెలుపు కాదు ముఖ్యం ... జవాబుదారీతనం ?
ఈ విజయాన్ని పురస్కరించుకుని టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలు వెస్ట్ బెంగాల్ లో విద్వంసాన్ని సృష్టించారు. ముఖ్యంగా బీజేపీ కార్యాలయాల ముందు విజయోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా, వారి ఫ్లెక్షీలను తగలబెట్టడం, కార్యాలయాలను నాశనము చేయడం, కార్యకర్తల మీద దాడులు చేయడం, వారి వ్యాపారాలపై లూటీలు చేయడం, హోటల్స్ ను పగలగొట్టడం, డబ్బులు దోచుకుని పోవడం ఇలాంటి ఎన్నో అరాచకాలను సృష్టించారు. అంతే కాకుండా ఆడపిల్లపై అత్యాచారానికి పాల్పడి ప్రాణాలను తీయడం ఎంతో బాధాకరం. అయితే మమతా బెనర్జీ మాత్రం వీటన్నింటికీ నేను కారణం కాదని సైలెంటుగా కూర్చుంది. ఈ విధంగా టీఎంసీ కార్యకర్తలు చేసే దురాగతాలను సమర్ధిస్తూ వస్తోంది.
అదే మనము తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ కూడా డీఎంకే విజయాన్ని పురస్కరించుకుని ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు అమ్మ క్యాంటీనుల ఫ్లెక్సీలు చించేసి...ఆ బోర్డులను కింద పడేసి..క్యాంటీను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనితో ఎఐడీఎంకే వాళ్ళు కేసు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డీఎంకే ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయడానికి అనుమతిచ్చింది. ఆ తరువాత స్టాలిన్ వారిద్దరినీ పార్టీనుండి సస్పెండ్ చేశారు. ఇది బాధ్యతాయుతమైన నాయకుడు చేయాల్సిన పని. ఈ సంఘటనతో అయినా మమత స్టాలిన్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.