సింహాల నుంచి మనుషులకు కరోనా?

praveen
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది మొదటి రకం  వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం కరోనా వైరస్ మరింత వేగం గా వ్యాప్తి చెందుతుంది కరోనా. ప్రజలందరి లో కరోనా వైరస్ పై పూర్తి స్థాయి అవగాహన వచ్చినప్పటికీ ఇక అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా పంజా విసురు తుంది. దీంతో దేశం లో రోజు రోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతం గా పెరిగి పోతున్న నేపథ్యం లో అందరూ బెంబేలెత్తి పోతున్నారు.



 దాదాపుగా ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసులు మనుషుల్లో వెలుగు లోకి వచ్చాయి కానీ జంతువుల్లో కరుణ కేసులు ఇప్పటి వరకు వెలుగు లోకి రాలేదు కానీ ఇటీవలే హైదరాబాద్ లోని జూలాజికల్ పార్కులో సింహాల కు కరోనా పాజిటివ్ రావడం మాత్రం సంచలన గా మారి పోయింది.  ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు జూలాజికల్ పార్కులో సందర్శకులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  అంతేకాదు సింహాలకు ప్రత్యేకమైన చికిత్స కూడా అందిస్తున్నారు.



 అయితే హైదరాబాద్లోని నెహ్రు జూలాజికల్ పార్కులో 8 సింహాలకు కరోనా పాజిటివ్ రాగా వెంటనే అప్రమత్తమైన పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. అయితే ఈ వైరస్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు అంటూ చెప్పుకొచ్చింది. జంతువు లకు కరోనా వైరస్ సోకటం దేశంలో తొలిసారి అంటూ చెప్పిన అటవీ శాఖ ఇక జంతువుల నుండి మనుషులకు వైరస్ సోకటం  జరగ లేదని స్పష్టం చేసింది. ఇక ఈ విషయాన్ని రిపోర్ట్ చేసే సమయం లో మీడియా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర అటవీ శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: