ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం...?
గత సంవత్సరం కూడా ఈ విధంగా ఢిల్లీ లో కేసులు నమోదైనది లేదు. కానీ సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాబోయే రోజుల్లో మనము కఠినంగా ఉంటే తప్ప సురక్షితంగా ఉండలేమని అందుకే లాక్ డౌన్ విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగుండాలని అన్ని రకాల చర్యలను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియచేశారు. ఉన్న హస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉన్న మాట వాస్తవమే, కానీ అత్యవసర సేవలు, ఫుడ్ సర్వీసెస్ మరియు మెడికల్ సర్వీసెస్ కి అంతరాయం కలుగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
తంలో లాగే పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారు కేవలం 50 మందితోనే చేసుకోవాలన్నారు. ఇలాంటి వాటి కోసం ముందుగానే పాసుల కోసం అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. ఈ కోవిడ్ పరీక్షల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఇటువంటి విపత్కర సమయంలో ఢిల్లీ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు వర్క్ ప్రం హోమ్ విధానాన్ని ప్రారంభించాలని సూచించారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని అన్నారు.