అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ధారబోశారు...ఎంత పట్టుకున్నారో తెలుసా...?

VAMSI
మాములుగా మన దేశంలో ఎన్నికలు అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఎలక్షన్ పీరియడ్ లో నేతలు ధనాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతూ తమ ఆధిక్యత కోసం పరుగులు తీస్తారు నాయకులు. అయితే ఇది ఎప్పటి నుండో వస్తున్న రాజకీయం సంప్రదాయమే. ఓటుకు నోటు తీసుకునే పౌరుడు లేకపోతే.... ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టే నాయకులు ఎందుకు పుట్టుకొస్తారు అన్న సామెత లేకపోలేదు.... అయినా ఇదంతా ఎప్పుడూ జరిగే తతంగమే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీ మొత్తంలో నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. అంత పెద్ద మొత్తంలో ధనాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారంటే అర్ధం చేసుకోండి.

అయితే ...ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగా ప్రస్తుతం... పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఘట్టం కొనసాగుతోంది. మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. శనివారం ఐదో దశ ఎన్నికలు జరగుతున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో పలు పార్టీలు తమ ఆధిక్యతను పెంచుకోవడం కోసం ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మద్యాన్ని కుమ్మరించాయి . పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.

ఇంత పెద్ద మొత్తంలో భారీగా నగదు, మద్యం ,డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు పేర్కొన్నట్లు వినికిడి. 2016 లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే... ఈ సారి రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఖర్చు చేసిన ధనం రెట్టింపు అయింది అని కొన్ని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇలా జరగడం ప్రజాస్వామ్యానికే ఒక మచ్చగా పలువురు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఇటువంటి డబ్బు, మందు, బంగారు పంచకుండా ఎన్నికలు జరుగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: