ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా.. ఎందుకో తెలుసా..?
అయితే అటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే అటు అధికార పార్టీకి తిరుగులేకుండా పోయింది అనే చెప్పాలి. అయితే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అందరు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యం లో ప్రజలందరికీ రెండు సార్లు చేతి వేళ్ళపై సిరా వేశారు అధికారులు ఇక ఇప్పుడు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో భాగం గా ఓటు హక్కు వినియోగించుకునే వారి ఎడమ చేతి చిటికెన వేలి పై సిరా గుర్తు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా వేశారు.. అయితే ఈ సిరా గుర్తు ఇప్పటికి కూడా చెరిగిపోయి ఉండదు అని భావిస్తున్న అధికారులు ఇక ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా వేసేందుకు సిద్ధమవుతున్నారు.