రెచ్చిపోయిన మానవ మృగం.. మూడేళ్ల చిన్నారి ఒంటరిగా ఉండటంతో..?

praveen
నేటి సభ్య సమాజంలో మహిళల జీవితం ప్రశ్నార్థకంగానే మారింది మానవత్వం ఉన్న మనుషులు కరువైపోయి పూర్తిగా కామంతో కళ్లు మూసుకుపోయి మానవమృగాలు గా మారుతున్న మనుషులే నేటి రోజుల్లో ఎక్కువై పోతున్నారు. దీంతో అడుగడుగున ఆడపిల్ల కామాంధుల బారినపడి పడి బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మహిళలకు రక్షణ కల్పించడానికి ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో.



 నెలలు నిండని పసికందును నుంచి పండు ముసలి వరకు కూడా అందరి పై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అయితే అభం శుభం తెలియని చిన్నారులపై కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు విరుచుకుపడి అత్యాచారం చేస్తూ ఉండడం అటు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. అభం శుభం తెలియని ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది.  తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.



 కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక మానవ మృగం అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై విరుచుకుపడి అత్యాచారానికి ఒడిగట్టాడు. భూపతి నగర్కు చెందిన చిన్నారిపై అక్కడే నివాసం ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: