నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?
అయితే ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా తనకు అధ్వాన పరిస్థితి వచ్చింది అని భావించి దీనికంతటికీ దేవుడే కారణం అని అనుకొని ఏకంగా దేవుడిపైన దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది లాక్ డౌన్ సమయం లో ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక సమస్యల్లో మునిగిపోయారు. మరికొంతమంది కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత కూడా ఉపాధి పనులు దొరకకపోవడంతో చివరికి మరింత దుర్భర స్థితిని అనుభవించారు.
అయితే ఇక్కడ ఒక యువకుడికి కూడా లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు అయితే దీనికంతటికీ కారణం దేవుడే అని ఆరోపిస్తూ ఆ యువకుడు ఆలయం పై దాడికి దిగడం సంచలనంగా మారిపోయింది. ఆలయ ప్రాంగణంలో శివుని విగ్రహం తో పాటు మరికొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి పలుచోట్ల రాళ్లు ఇటుకలు పడి ఉన్నాయని ఫిర్యాదు రాగా ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనలో 28 ఏళ్ల వివేక్ హస్తం ఉంది అని భావించారు దీంతో వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను సమస్యల పాలు కావడానికి దేవుడే కారణమని అందుకే ప్రతీకారంగానే ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశాను అంటూ ఒప్పుకున్నాడు సదరు వ్యక్తి.