మహిళలు ఉచితంగా బస్ లో వెళ్లొచ్చు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

praveen
ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కూడా  సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు సర్వీసులను అందిస్తున్నాయి. ఈ క్రమం లోనే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బస్సులను సామాన్య ప్రజలందరూ వినియోగించుకుంటూ ఎంతగానో లబ్ధి పొందుతున్నారు. ఇక సామాన్య ప్రజలు అందరికీ తక్కువ ఖర్చు తోనే ఆర్టీసీ సర్వీసులు అందుబాటు లో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాలు ఆర్టీసీ సర్వీసులను ఎంతో తక్కువ ధరకే అందిస్తుండగా ఇక ఆర్టీసీ సర్వీసు లలో మరింత ప్రయోజనం పొందేందుకు..  నెలవారి బస్సు పాసులను కూడా అందిస్తుంది అనే విషయం తెలిసిందే.



 అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు అటు ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇక ఆర్టీసీ ప్రయాణాలను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి. కాగా ప్రస్తుతం ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న అందరికీ కూడా ఆర్టిసి బస్సు ప్రయాణాలు కొంత పరిధి మేరకు ఉచితంగానే ఉంటాయి. ఇకపోతే సాధారణ ప్రజలకు  ప్రభుత్వాలు చాలా తక్కువ ధరకే ఉచిత  ప్రయాణాలకు అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. కాగా ఇటీవలే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని అటు రాష్ట్ర మహిళలు అందరికీ శుభ వార్త చెప్పింది.



 ఇక పంజాబ్లోని మహిళలందరికీ కూడా రేపటి నుంచి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని బాలికలు, మహిళలను సాధికారత వైపు నడిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చూపించిన విధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అనుకునే మహిళలు ముందుగా  పంజాబ్కు చెందిన వారు అని తెలియడానికి ఒక ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది. ఏసీ ఓల్వా లగ్జరీ బస్సులో తప్ప మిగతా అన్ని రకాల బస్సు సర్వీసులలో కూడా ఉచితంగానే ప్రయాణించేందుకు అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: