బర్త్ డే కి కార్ ఇప్పిస్తానన్న ప్రియురాలు.. చివరిలో ఊహించని ట్విస్ట్..?

praveen
ఈ మధ్యకాలంలో మోసగాళ్లు ఎక్కువై పోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తేచాలు ఎప్పుడు సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో దాడిచి చేసి వరికి ఖాతాలను ఖాళీ చేస్తారో అని భయపడే పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది సైబర్ నేరగాళ్ళు  రెచ్చిపోయి ఏదో ఒక విధంగా ఎర వేసి చివరికి డబ్బులు దండుకుంటూ ఉంటే  మరికొంతమంది మోసగాళ్ళు మాయమాటలతో పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత బ్లాక్మెయిల్కు దిగి డబ్బులు  దండుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది..  సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షల రూపాయల నగదు నగలు ఆభరణాలు కూడా దోచుకుపోయింది. ఈ ఘటన మైసూరులో వెలుగులోకి వచ్చింది.  బెంగుళూరు ఆంధ్ర హళ్లి  రెండో  ప్రధాన రహదారిలో నివాసముండే బిందు గౌడ అనే 25 ఏళ్ల యువతి టెన్త్ చదివింది. ఫేస్బుక్ లో చిన్ను  గౌడ అనే పేరుతో ఒక ఖాతా తెరిచి  రవి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది.   అందమైన ఫోటోలను యువకుడికి పంపించి ఇక ఆ తర్వాత ప్రేమిస్తున్నాను అంటూ మాయ మాటలు మొదలు పెట్టింది.



 తనకు కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఇక... నీ  పుట్టినరోజు నాడు ఏకంగా 45 లక్షల విలువచేసే ఫార్చునర్ కారు బహుమతిగా ఇస్తానని ఒక లక్ష రూపాయలు తక్కువగా ఉన్నాయి పంపించాలి అంటూ యువకున్ని  కోరింది యువతి. దీంతో ఆ యువకుడు వెనకా ముందు ఆలోచించకుండా లక్ష రూపాయల పంపాడు ఇక ఆ తర్వాత.. పలుమార్లు నగలు కూడా కావాలి అని కోరడంతో పంపించాడు ఇక ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన రవి పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు బిందు గౌడ అని గుర్తించి అరెస్టు చేశారు. గతంలో కూడా ఆమెపై కేసులు ఉన్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: