మహాశివరాత్రి పూజా సమయంలో తప్పకుండా పాటించవలసిన నియమాలు ఇవే..
మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా భావిస్తుంటాం. ఈ రోజున శివుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తే సమస్యలు తొలగిస్తాయని విశ్వాసం. మహశివరాత్రి రోజున ఓ జీవికి హాని తలపెట్టకుడదని పురోహితులు అంటుంటారు. ఇక ఆ శివుడికి పూజా చేసే సమయంలో తప్పకుండా పాటించవలసిన నియమాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నియమాలు..
1. ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి. ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం 2. నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి.
3. ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి.
4. శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి.
5. తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే.
6. కృష్ణపక్ష చతుర్ధశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు.
7. అలాగే మాఘ బహుళ చతుర్ధశినే మహాశివరాత్రిగా జరపుకుంటాం.
8. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.
9. మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.
10. ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి.
11. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.
12. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి.
13. శివుడికి బిల్వపత్రాలతో అర్చించడం, రుద్రాభిషేకం చేయడం వలన సకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.