మత మార్పిడి విషయంలో ఆ లాజిక్ పూర్తిగా తప్పు...!!!

Purushottham Vinay
కులం, మతం అనేవి భారతదేశంలో ఇప్పుడు పెద్ద విషయాలుగా మారాయి. మన పురాతన కాలంలో చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఇలాంటి భేదాలు ఉండేవి కావు. ఆనాటి కాలంలో గురువులు తమ శిష్యులకి మంచి మంచి విద్యాబుద్దులు నేర్పించేవారు. అందరి పిల్లలని కలిపి ఒకే చోట కూర్చోబెట్టి అనేక రకాల మంచి మంచి విద్యా బుద్దులు నేర్పేవారు మన పెద్దలు. అందరితో ఎలా కలిసిమెలిసి ఉండాలో ఎవరితో ఎలా ఉండాలో తల్లి దండ్రులతో ఇంకా పెద్దలతో ఎలా నడుచుకోవాలో చాలా చక్కగా నేర్పేవాళ్ళు మన పూర్వికులు, పెద్దలు.


అసలు నిజానికి ప్రపంచంలో విద్య అనే పదం పుట్టుకోచ్చింది మన ఇండియా నుంచే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు మన దేశంలోనే ప్రవేశపెట్టారు. అందుకు ఉదాహరణలే తక్షశీల, నలంద విశ్వవిద్యాలయాలు.. ఇక మతం, కులం అనే విషయానికి వస్తే మొదటగా ముస్లింల వల్లే బేధాలు వచ్చాయి. వారు మనదేశానికి వచ్చి. ముస్లిం మతాన్ని ప్రవేశపెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చాక క్రైస్తవ మతం పరిచయం అయ్యింది.


అప్పట్లో వాళ్ళ దగ్గర పని చేసే మనవాళ్ళు క్రైస్తవ మతంలోకి మారారు. అయితే ఆనాటి కాలంలో పెద్ద కులాల వారు చిన్న కులాల వారిని చిన్నచూపు చూసేవారట.అది అన్ని వూళ్లలో జరిగేది కాదట. కేవలం కొన్ని వూళ్లలో మాత్రమే జరిగేదట. ఇక వారు అలా చిన్నచూపు చూడటానికి దానికి వేరు వేరు కారణాలు వున్న కాని దానికి మత మార్పిడి కూడా ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. కాని కాదు 1715 వ సంవత్సరంలోనే రెడ్డి కులాలకు చెందిన వారు క్రైస్తవ మతం పుచ్చుకున్నారు.అంతే కాని మత మార్పిడి వల్ల పెద్ద కులాల వారు చిన్న కులాల వారిని చిన్న చూపు చూసారనడంలో ఎలాంటి లాజిక్ లేదని స్పష్టంగా అర్ధమవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: