పండిట్లు కాశ్మీర్లో ఉండడానికి సిద్ధం...కారణం ఇదే...?
కాశ్మీర్ పాకిస్థాన్ దేశానికి దగ్గరగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. పాకిస్థాన్ నుండి యువకులు మెల్ల మెల్లగా కాశ్మీర్ లోకి చొరబడి, అక్కడి కాశ్మీరీ ముస్లిం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ఇలా కొనసాగుతూ ఉండడంతో ఒకానొక దశలో కాశ్మీర్ లో పాకిస్థాన్ దేశానికి చెందిన పౌరసత్వాలు ఎక్కువ అయిపోయాయి, తద్వారా కాశ్మీర్ వాళ్ళ పౌరసత్వాలు తగ్గిపోవడంతో అక్కడి కాశ్మీర్ పండిట్లకు ఇది చాలా కష్టంగా మారింది. దీనితో వారి భయమే వీరి ఆయుధంగా మారింది. ఎలాగైనా కాశ్మీర్ ను హస్తగతం చేసుకోవాలనే కోరిక ఎక్కువైంది. అక్కడి నివసిస్తున్న పండిట్లను 1990 లో భారీ ఊచకోతతో వేలాది కుటుంబాలను మట్టుబెట్టారు.
ఈ వివాదాల్లో ప్రాణాలతో బయటపడినవారు వారి యొక్క ఆస్తులను, అన్నింటినీ వదులుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారతదేశంలోనే అక్కడక్కడా స్థిరపడిపోయారు. దీని తరువాత ఏ ఆర్టికల్ మూలాన పండిట్లు మరియు భారతీయులు కాశ్మీర్ ను వదులుకోవాల్సి వచ్చిందో, అదే ఆర్టికల్ 370A 35A ను ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయడంతో మళ్ళీ భారతీయులు మరియు పండిట్లు కాశ్మీర్ లో నివసించే విధంగా వారికి అన్నీ వనరులను కల్పిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కాలనీలను నిర్మిస్తున్నారు.
వారు కోల్పోయిన ఆస్తులు వారికే చెందే విధంగా, అక్కడే చదువుకొని ఉద్యోగాలు పొందే విధంగా కొన్ని చట్టాలలో మార్పులు చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ కాశ్మీర్ లో ఇటీవల ఇచ్చిన ఒక ఉద్యోగ పిటిషన్ లో భాగంగా 2000 ఉద్యోగాలకు సంబంధించి ఇస్తే, దానికి 30,000 వరకు అప్లికేషన్ లు స్వీకరించబడ్డాయి. ఇది అక్కడ మార్పు జరుగుతోంది అనడానికి ప్రత్యేక ఉదాహరణ. ఉగ్రవాదుల బెదిరింపులకు కూడా తలొగ్గకుండా పండిట్లు ముందుకు రావడాన్ని గొప్ప మలుపుగా భావించవచ్చు.