ట్రైన్ కదులుతుండగా రెచ్చిపోయిన కామాంధులు.. ఏం చేశారో తెలుసా..?

praveen
మహిళ అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా నడిరోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి అసలు సిసలైన స్వాతంత్రం వచ్చింది అని అన్నారు గాంధీ గారు..  కానీ నేటి రోజుల్లో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఒక మహిళ నడిరోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నేటి సభ్య సమాజంలో మహిళలకు రక్షణ ఉందా అంటే అందరి నోటా సమాధానం శూన్యం. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు అలాంటివి మరి. ఆడది కనిపిస్తే చాలు అడుగడుగునా కామంధులు రోజూ రేచ్చిపోతూనే వున్నారు. వెరసి రోజురోజుకు మహిళల జీవితం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.


 కామందుల బారినపడకుండా ఉండేందుకు మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా రెచ్చిపోతున్నారు మానవ మృగాలు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలు చేస్తూ సభ్య సమాజంలో మహిళల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నారు కామాంధులు. మహిళ పై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడంలేదు. అటు పోలీసులు అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపి నప్పటికీ.. మానవ మృగాలలో మాత్రం భయం కనిపించడం లేదు.



 ఇటీవలే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే చెన్నైలో మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. రైలు బోగీలో ఈ దారుణానికి ఒడిగట్టారు మానవమృగాలు. నగర శివారు ప్రాంతానికి చెందిన మహిళ  తాంబరం - చెన్నై బీచ్ స్టేషన్ల మధ్య పండ్లు తిరిగే సబర్బన్ రైలులో పనులు విక్రయిస్తూ ఉంటుంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే మద్యం తాగి చివరి భోగి లో కూర్చుంది మహిళ. అలాగే నిద్ర పోయింది. అయితే రైలు బోగీలను శుభ్రం చేసేందుకు వచ్చిన దినసరి కూలీ సురేష్, కలిల్  మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఆ తర్వాత తాంబరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: