కన్యాదాతగా మారిన అన్న.. కానీ అంతలో ప్రాణం పోయింది..?

praveen
తన చెల్లికి పెళ్ళి జరుగుతుంది అని ఆ అన్న ఎంత గానో సంతోషం లో మునిగి పోయాడు.  ఇక తానే స్వయం గా కన్యా దాతగా మారి చెల్లి పెళ్లి ఎంతో ఘనం గా జరిపించాడు  అన్న. ఇక ఎంతో ఆనందం తో చెల్లిని అత్త వారింటికి పంపించాడు. అయితే పెళ్లి పెళ్లి చేసిన కొన్ని గంటల వ్యవధి లోనే ఆ అన్న ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అతని ఆనందాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది. చివరికి రోడ్డు ప్రమాదం రూపం లో అతని ఆనందానికి చిది మేసింది. మృత్యువు ఒడిలోకి చేర్చింది. దీంతో ఆ పెళ్లి కూతురుకి పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం కంటే అన్న ప్రాణం పోయింది అన్న బాధ ఎక్కువగా మిగిలి పోయింది.


 ఈ విషాదకర ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. తోగుట మండలం ఎల్లారెడ్డిపేట కు చెందిన పరశురాములు చెల్లి వివాహం ఇటీవలే జరిగింది.  ఇక తనకు కూతురు లేకపోవడంతో ఏకంగా చెల్లి పెళ్లికి కన్యాదాతగా మారి సోదరి వివాహం జరిపించాడు అన్న. సిద్దిపేట మండలం బంధువులను దించేందుకు సాయంత్రం బయలు దేరాడు. ఈ క్రమంలోనే కారులో ఆరుగురు ప్రయాణికులు వెళ్లగా.. ఇద్దరు బంధువులను వారి ఇంటి దగ్గర దించేసి మిగిలిన నలుగురు తిరిగి వస్తున్న సమయంలో.. అతి వేగం కారణంగా కారు ఓ చెట్టును వేగంగా ఢీకొట్టింది.



 దీంతో కారులో ప్రయాణిస్తున్న పరశురాములు అక్కడికక్కడే మరణించాడు. చిన్నాన్న  కొడుకు నాగేష్..  తమ్ముడు బావమరిది రాగుల అజయ్ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. వీరిద్దరూ కూడా చికిత్స పొందుతూ మరణించారు. మరో బంధువు కూడా తీవ్ర గాయాల బారిన పడడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: