కరోనా వ్యాక్సిన్ సామాన్యులకు చేరేదెప్పుడంటే...?
రోజూ ప్రతి సెషన్లో 100 నుంచి 200 మందికి వ్యాక్సిన్ ఇస్తారని, ఆ తర్వాత వారిని అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా లేక అంతా సవ్యంగానే ఉందా అనేది పరిశీలిస్తారని కేంద్రం ప్రభుత్వం చెప్పినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా సాధారణ ప్రజలకు టీకా చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది...???... అప్పటివరకు కరోనా ఉద్ధృతి ఎలా ఉండబోతోంది..?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దేశంలోని ప్రజలందరికీ టీకా అందడానికి మరి కొన్ని నెలల సమయం పడుతుందని సమాచారం. ఇకపోతే అప్పటివరకు కరోనా వ్యాప్తి విషయానికొస్తే... ఎలాగో డాక్టర్లకు, నర్సులకు, హెల్పర్స్ కు, పోలీసులకు ఇలా ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్ లో ఉండే ప్రజా సేవకులకు మొదటిగా కరోనా వ్యాక్సిన్ అందుతుంది. కాబట్టి కరోనా వ్యాప్తి ఈ విధంగా తగ్గిపోతుందని... వ్యాక్సిన్ పొందని సాధారణ ప్రజలు సైతం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ అందేవరకు ఎప్పటిలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ హాయిగా ఉండొచ్చని చెబుతున్నారు.