అమిత్ షా టూర్ లో అదే జరిగితే.. మరో సంచలనమే.?

praveen
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఎన్నో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇటీవలే బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన సమయంలో ఏకంగా జేపీ నడ్డా కాన్వాయ్ పై  దాడి జరగడం సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో తప్పు అని చెప్పిన గవర్నర్ ను  కూడా నిర్బంధంలో ఉంచడం అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నేత హత్య జరగడం ఇలా వరుసగా పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోతున్నాయి  అనే విషయం తెలిసిందే. కాగా జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరగడం తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రంలో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సమన్లు జారీ చేసింది.




 అదే సమయంలో తీరు మార్చుకోవాలి అంటూ మమత ప్రభుత్వం ను హెచ్చరించింది. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మాత్రం ఐపీఎస్ అధికారులకు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది అంతేకాకుండా రాష్ట్రపతి పాలన పశ్చిమ బెంగాల్ లో పెట్టే దమ్ము బీజేపీకి ఉందా అంటూ సవాల్ కూడా చేసింది మమతాబెనర్జీ. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ కీలక నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పర్యటించేందుకు సిద్ధం కావడం మరింత సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 మావోయిస్టులకు కంచుకోట అయినటువంటి 24 పరగణాల లో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు అమిత్ షా. జేపీ నడ్డా కాన్వాయ్ పై  దాడి తర్వాత సానుభూతి కోసం బిజెపి ఎదురు చూస్తోందని అందరూ అనుకున్నప్పటికీ ఎదురు దాడి చేయడానికి సిద్ధమైంది బిజెపి.  కాగా అమిత్ షా టూర్ లో భాగంగా గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విజయానికి ముఖ్య కారకుడు అయినటువంటి సువెందు  ప్రస్తుతం బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మమతా బెనర్జీ సువెందు కి  సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో బీజేపీ లో  చేరబోతున్నారని ఇదే జరిగితే ఇది ఒక సంచలనం గా మారబోతుంది అని విశ్లేషకులు అంటున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: