అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి.. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంబంధాలు మగవాళ్ళ
కన్నా కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటడటం గమనార్హం.చాలా చోట్ల భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, జీవితాలను నాశనం చేసుకోవడం తో పాటుగా కుటుంబ కలహాలతో వల్ల ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు ఎదురైంది. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసింది ఓ వీర వనిత.. ఈ దారుణ ఘటన గుంటూరులో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. నగరంలోని అరండల్పేట
పోలీస్ స్టేషన్ పరిధి
రాజీవ్ గాంధీ నగర్కి చెందిన మరియదాసు మార్బుల్ పని చేస్తుంటాడు. అతనికి మరియమ్మతో 20 ఏళ్ల కిందట వివాహమైంంది. ఒక కొడుకు, కూతురు సంతానం. కూతురికి
తెనాలి మండలం పెరవలికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో పెరవలికి చెందిన ఆటోడ్రైవర్ అనిల్తో మరియమ్మకి పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. వారిద్దరి రహస్య శృంగారం
భర్త మరియదాసు తెలిసిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురవడంతో పాటుగా ఆమెను సంబంధం మానుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు..
అయితే,
భర్త అడ్డును తొలగించుకోవాలని అనుకున్న
భార్య పక్కా ప్లాన్ వేసింది.ప్రియుడితో కలసి పక్కాగా ప్లాన్ చేసి దారుణంగా
హత్య చేసింది. రాత్రి వేళ కొడుకు యార్డులో పనికి వెళ్లిన సమయంలో ప్రియుడు అనిల్కి కబురుపెట్టింది. ఇద్దరూ కలిసి మద్యం మత్తులో నిద్రిస్తున్న మరియదాసు మెడకు
ఉరి బిగించి , తల పై రోకలి బండ తో అతి కిరాతకంగా చంపింది.భర్తను అక్కడే వదిలేసి పరారైంది. ఆ తర్వాత కొడుక్కి
ఫోన్ చేసి హైడ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది. నాన్నకి
యాక్సిడెంట్ అయిందని.. ఇంట్లో ఉన్నాడని చెప్పింది. కొడుకు ఇంటికి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి బంధువులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.తెనాలి పరిసరాల్లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో
హత్య చేసినట్లు అంగీకరించారు..