దారుణం : పబ్జి ఆడేందుకు మొబైల్ ఇవ్వలేదన్న కోపంతో..?

praveen
పబ్జి యువతను ఎంతగా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్జి ఆట  కోసం ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఎన్నో  తెర మీదికి వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పబ్జి యువతను ఎంతగానో ఆకర్షించింది గంటల గంటల పాటు  ఆటలో మునిగితేలేలా చేసింది. పబ్జి ఆడుతూ ఆడుతూ బానిసలుగా మారిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఎన్నో తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. అదే పబ్జి సమయంలో ఆడుతుండగా తల్లిదండ్రులు మందలించారు అన్న కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు ఎంతోమంది యువకులు. ఇలా పబ్జి ఎన్నో కుటుంబాల్లో  తీరని విషాదాన్ని నింపింది.


 ఆడుతూ పబ్జి బానిసలుగా మారిపోయి రుగ్మతలు ఏర్పడి గుండె పోటు వచ్చి మరణించిన వారు కొంతమంది అయితే పబ్జి ఆడకూడదు అని తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నవారు మరికొంతమంది. తాజాగా మరో ప్రాణాన్ని బలితీసుకుంది పబ్జి. గేమ్  ఆడటానికి తన స్నేహితుడు మొబైల్ ఇవ్వలేదు అని కోపంతో...  స్నేహితుడు అని కూడా చూడకుండా ఉన్మాదిగా  మారిపోయిన బాలుడు స్నేహితుని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


 రాజస్థాన్ లో జరిగింది ఈ ఘటన. రాజస్థాన్ కీ  చెందిన 14ఏళ్ల బాలుడు అతని స్నేహితుడు హమీద్ మొబైల్ లో  పబ్జి గేమ్ ఆడేవారు.  రోజు గంటల తరబడి పబ్జి గేమ్ ఆడుతూ కాలయాపన చేసే వారు. అయితే హమీద్ ఫోన్లో తరచూ ఇద్దరు బాలురు పబ్జి గేమ్ ఆడుతూ ఉండేవారు. అయితే ఈనెల 9వ తేదీన హామీద్  పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. ఏమై ఉంటుందా అని వెళ్లి చుస్తే పబ్జి ఆడేందుకు మొబైల్ ఇవ్వలేదని  కోపంతో బాలుడు హమీద్ తలపై  బండరాయితో మోదటంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ  నిజాలు అన్నీ పోలిస్ విచారణలో బయట పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: