పాఠశాలల్లో కరోనా వస్తే.. మంత్రి కీలక వ్యాఖ్యలు..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పై కరోనా వైరస్ ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి  సర్కార్ పాఠశాలను ప్రారంభించేందుకు ముందడుగు వేసిన విషయం తెలిసింది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతో ఎక్కడా వెనక్కి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలను  నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కఠిన నిబంధనల మధ్య విద్యాబోధన చేసేందుకు నిర్ణయించింది.




 రోజు విడిచి రోజు విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు కేవలం ఒంటిపూట వరకు మాత్రమే విద్యార్థులకు విద్యాబోధన చేసి మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపించేందుకు నిర్వహించింది జగన్ సర్కార్. అయితే జగన్ సర్కారు నిర్ణయించినట్టు గానే  రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యాయి కానీ మొదటి రోజు నుంచే పాఠశాలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వెలుగులోకి వస్తుండడం మాత్రం ఆందోళనకరంగా మారిపోయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను  స్కూళ్లకు పంపాలి అంటేనే భయపడిపోతున్నారు.



 ఇక  పాఠశాలలో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రభుత్వ స్కూళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీని కోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను  కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. స్కూళ్లలో కరోనా సోకిన విద్యార్థులను టీచర్లను  కూడా ఐసోలేటెడ్ చేశాము  అంటూ తెలిపారు. మూడు వారాల తర్వాత 9, 10 తరగతులు నిర్వహించడం పై కీలక నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపిన ఆయన.. నిన్న మొన్నటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు అంతకుముందు కరోనా నిర్ధారిత పరీక్షలు చేసిన అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: