అల్లున్ని చెట్టుకు కట్టేసి కొట్టిన అత్త.. పక్కనే ఉండి సపోర్ట్ చేసిన భార్య.. కారణం..?

praveen
మామూలుగా పెళ్లి చేసుకున్న అమ్మాయి కి అత్తింట్లో వేధింపులు ఎదురవడం లాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్. పెళ్లి చేసుకున్న యువతికి  కాదు యువకుడికి అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఎంతలా అంటే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునే రేంజ్ లో  అత్తింటివారూ వేధించారు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఆటోనగర్ తుమ్మలగుంట కు చెందిన పిండి దేవేందర్ కు... సంఘం మండలం వెంకటాపూర్ కు చెందిన లావణ్య తో వివాహం జరిగింది.



 ఇక వివాహం జరిగిన ఐదేళ్ల పాటు వీరి కాపురం ఎంతో సజావుగా సాగింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో గత కొంత కాలం నుంచి అత్తింటి వారితో దేవేందర్ కి అస్సలు పడటంలేదు. ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ నెల 9వ తేదీన కూడా అత్తవారింటి కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో ఏకంగా  అల్లుడు అని కూడా చూడకుండా దేవేందర్ పై దాడికి దిగారు అత్తింటి కుటుంబ సభ్యులు.



 భార్య కూడా పుట్టింటి వారికి సహకరించింది. అందరూ కలిసి దేవేందర్ ను చెట్టుకు కట్టేసి బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు. దీంతో దేవేందర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అయినప్పటికీ పిల్లల కోసం జీవించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలనే పిల్లలను చూసేందుకు అత్తవారింటికి వెళ్ళాడు. మళ్లీ అక్కడ అవమానమే. అంత అవమానించాకా  మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్... పిల్లలను చూపించే ప్రసక్తే లేదు అంటూ చీదరింపులతో  తలుపులు మూసేశారు అత్తింటివారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు దేవేందర్. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయగా హుటాహుటిన అక్కడకు చేరుకుని అంబులెన్స్ అతన్ని ఆసుపత్రికి తరలించగా..  చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు.  మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: