యువతిపై సామూహిక అత్యాచారం.. ఇందులో యాంకర్ ప్రదీప్ కూడా..?

praveen
ఇటీవలే హైదరాబాద్ నగరం లో పోలీసుల వద్దకు వచ్చిన ఒక అత్యాచార ఘటన కేసు  ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా  మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ఓ యువతి  తనపై 139 మంది అత్యాచారం చేశారు అంటూ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం చేసినవారిలో ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రతినిధులు సహాయకులు కూడా ఉన్నారని సదరు యువతి చెప్పింది. ప్రస్తుతం సదరు యువతి  చెప్పిన సినీ రాజకీయ ప్రముఖుల్లో .. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు ఉన్నారు. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్.. ఉద్యమ సంఘాల నేతలు.. ఎంతో మంది ప్రముఖుల పేర్లు కూడా యువతితో ఫిర్యాదులో  తెలిపటం  ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

 పోలీసులకు ఫిర్యాదులో  ఆ యువతి  పేర్కొన్న వివరాలు కలకలం రేపుతున్నాయి. అమ్మాయి ఫిర్యాదులో  తెలిపిన పేర్లలో యాంకర్ ప్రదీప్ తో పాటు నటుడు  కృష్ణుడు.. మాజీ ఎంపీ కవిత పీఏ సంతోష్ లాంటి ఎంతో మంది ప్రముఖుల పేర్లు రావడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే మిర్యాలగూడ నుంచి ఉద్యోగం కోసం హైదరాబాదు రాగా.. తనను నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపారని..  ఈ క్రమంలోనే  139 మంది తనపై బలవంతంగా అత్యాచారం చేశారు అంటూ సదరు మహిళ పేర్కొంది, ప్రస్తుతం సదరు మహిళ పెట్టిన కేసు మాత్రం సంచలనంగా  మారిపోయింది.


 అయితే గత కొన్నేళ్ల నుంచి ఇది సాగుతుందని తాను ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారని కానీ రోజురోజుకు తనకు వేధింపులు ఎక్కువై పోవడంతో ధైర్యం చేసి ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించాను అంటూ సదరు యువతి  ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఏకంగా ఎంతో పేరు సంపాదించిన యాంకర్ ప్రదీప్ లాంటి ప్రముఖుల పేర్లు కూడా పేర్కొనడం సంచలనంగా మారగా..   దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఎంతో మంది ప్రముఖుల పేర్లు కూడా ఇన్వాల్వ్ కావడంతో ప్రస్తుతం పోలీసులు ఎంతో ఆచితూచి ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: