
ఇంత దారుణమా... మహిళను ప్రేమించాడని.. మూత్రం తాగించిన పెద్దలు!
మన భారత దేశంలో ఉన్నవారు.. లేని వారు ఉన్నారు. వాటి తో పాటుగానే ఎన్నో కట్టుబాట్లు, సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా కట్టుబాట్లు చూస్తుంటే ఆశ్చర్యం కాదు.. గుండెల్లో వణుకు పుట్టుకు వస్తుంది. అయితే కరోనా సమయంలో ఈ మద్య అందరూ శాంతి మంత్రం జపించారని అంటున్నారు.. భారత దేశం మొత్తం ఏకతాటిపై నడిచిందని అంటున్నారు. కష్టం వస్తే సాటి మనిషిని ఆదుకుంటున్నారని అంటున్నారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తప్పు చేస్తే భయంకరమైన శిక్షలు విధిస్తున్నారు. తాజాగా ఓ మహిళను ప్రేమించాడని యువకుడిపై కుల పెద్దలు దారుణంగా వ్యవహరించారు. విచక్షణ రహితంగా బూట్లతో కొడుతూ.. మూత్రం తాగించారు.
ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని శిరోహిలో ఇటీవల చోటు చేసుకుంది. కాకపోతే ఈ విషయం మాత్రం చాలా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఓ యువకుడు తన కులం మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కొంత కాలం వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది.. ఈ మద్య ఓ సందర్భంలో ఇంటి పెద్దలకు తెలియడంతో ఆ గొడవ కాస్త పంచాయితీ పెద్దల వద్దకు వెళ్లింది.
ఇక ఆ యువకుడికి చుక్కలు చూపించారు పంచాయితీ పెద్దలు. యువకుడిపై పంచాయతీ పెద్దలు దారుణంగా కొట్టారు. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ.. షూతో చితక బాధారు. ఆ తర్వాత ఓ సీసాలో మూత్రం తీసుకువచ్చి బలవంతంగా తాగించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి కొంత మందిని అరెస్టుగా చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Video of a man forced to drink urine goes viral. He is also being beaten up by several people. language and clothes indicate it is from Sirohi district and Rebari community. @fpjindia @PoliceRajasthan#Rajasthan #Atrocity pic.twitter.com/cFwWUbfJNd — Dr Sangeeta Pranvendra (@sangpran) June 16, 2020