మహిళా ఉద్యోగి ఇంటికెళ్లి గ్యాంగ్ రేప్.. కెమెరాలతో వీడియో షూట్ చేసి..
రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు అనడానికి ఈ ఘటన నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్న కామపిశాచాల ఆగడాలను అరికట్టలేక పోతున్నారు. ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. మరో ప్రభుత్వోద్యోగి ఈ ముగ్గురు ఒక్క ప్రభుత్వ ఉద్యోగినిపై కన్నేశారు.
వారు ఆమెపై అఘాయిత్యం చేయడానికి అదనుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంటికెళ్లి ఆమెపై కామవాంఛ తీర్చుకోవడమే కాకుండా పైశాచికత్వం ప్రదర్శించారు. ఆమెను రేప్ చేస్తూ ఆ తతంగాన్నంతా వీడియో షూట్ చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది.
మహాసముంద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ప్యూన్గా పనిచేస్తున్న మహిళను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అదును చూసుకొని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడారు. ఈ దాడిలోనిందితులను కానిస్టేబుల్ శశాంక్ శర్మ, అతని స్నేహితుడు రజో భారతి, టీచర్ కేపీ పటేల్, మరో ప్రభుత్వ ఉద్యోగి జయనారాయణ్ భోయిగా గుర్తించారు.
లేడీ ప్యూన్పై కన్నేసిన కామాంధులు ఆమె ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లోనే ఆమెను దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు నరకం చూపారు. అంతటితో ఆగకుండా ఆమెపై పైశాచికత్వం ప్రదర్శించారు. ఆమెను అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్ కెమెరాల్లో వీడియోలు షూట్ చేశారు. ఎవరికైనా చెబితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
బాధితురాలి కూతురిని కూడా చంపేస్తామని బెదిరింపులకు దిగడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక దారుణాన్ని దిగమింగింది. ఆ తరువాత కూడా నాలుగు నెలలుగా కామాంధుల వేధింపులు కొనసాగడంతో భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తనను దారుణంగా రేప్ చేయడమే కాకుండా వీడియోలతో బెదిరిస్తున్నారని చెప్పింది. కానిస్టేబుల్ శశాంక్ శర్మ తనను బెదిరించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రేప్ కేసు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.