ప్రాణం పోతుంటే.. ప్రాంక్ అనుకుంది.. చివరికి..?

praveen

ఈ  మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాప్స్ జనాలని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి అంటే మనిషి ప్రాణం పోతున్నా అది నిజమా అబద్దమా అని నమ్మలేని విధంగా ప్రభావితం చేస్తున్నాయి.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది టిక్ టాక్. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా టిక్ టాక్ లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మాయదారి టిక్ టాక్  కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఒక్క నిమిషమైనా టిక్  టాక్  లేకుండా ఉండలేక పోతున్నారు. టిక్ టాక్  కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకొన్న  వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది పిచ్చిపిచ్చి ప్రయోగాలతో చావు అంచుల దాకా వెళ్లి వస్తున్నారు. 


 ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటిదే  చేశాడు. టిక్ టాక్ బాగా ఫేమస్ అయిన జాసన్ క్లార్క్  అనే వ్యక్తి ఓ విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే నీటిలో ఆ విన్యాసం చేయాలనుకున్నాడు. అందరిల నీటిలో ఈత  కొడితే ఏం మజా వుంటుంది... గడ్డకట్టిన మంచి నీటిలో ఈత కొట్టాలని అనుకున్నాడు. ఇక అనుకున్నది తడవుగా గడ్డ  కట్టిన మంచినీటి లోకి ప్రవేశించి ఈత కొట్టడం ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత కొద్ది సేపటికి ఊపిరి ఆడక గిలగిల కొట్టుకున్నాడు. ఇక పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా ఎలాంటి దారి కనిపించలేదు. ఇక కొంచెం కొంచెంగా అతని బాడీ కూడా మంచు కడుతు ఉండడంతో... ఇక చనిపోవడం తధ్యం అనుకున్నాడు. 

 కానీ కొన ప్రాణంలో ఉన్న ఆ వ్యక్తి ఓ రంధ్రం ద్వారా బయట పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నా భయానక అనుభవాన్ని చూడండి అంటూ  సోషల్ మీడియా వేదికగా వీడియో ని పోస్ట్ చేశాడు ఆ వ్యక్తి. నీళ్లలో తిరిగి ఈత కొట్టేటప్పుడు  చుట్టూ అంతా ఓకేల  అనిపించింది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో పైకి రావాలని మంచుగడ్డ మొదలు కొట్టేందుకు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది.. శక్తినంతా కూడగట్టుకొని ఎలాగోలా బయటకి  వచ్చాను అంటూ పేర్కొన్నారు ఆ వ్యక్తి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటి అంటే... ఈ వీడియోను చిత్రీకరిస్తున్న యువతి అతనిని లోపల కొన ప్రాణంతో కొట్టుకుంటుంటే..ఫ్రాంక్ అని అలాగే ఊరుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: